మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్ళించి సినిమాలకు కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించా లనే ఉద్దేశం తో ఖైదీ నెంబర్ 150 సినిమా సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే రేంజ్ లో  విడుదల చేసిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు. ఈ సిని మా తో పాటు చిరంజీవి, మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

 ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లలో చక చక పూర్తి చేస్తున్న చిరంజీవి ఈ మధ్య కాలం లోనే మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించాడు, ఈ సినిమా లో చిరంజీవి కి జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇలా ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ లను  ప్రారంభించి న చిరంజీవి, బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్క బోయే సినిమా షూటింగ్ ను కూడా తాజా గా ప్రారంభించాడు, ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు బాబి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి నాలుగు సినిమా లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: