ఇస్మార్ట్
శంకర్ వంటి భారీ హిట్
సినిమా తర్వాత
పూరి జగన్నాథ్ సొంత నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో చేస్తున్న ఈ
సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించబోతోంది అనే నమ్మకాన్ని చిత్రయూనిట్ పెట్టుకుంది. దానికి తగ్గట్లుగనే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.
విజయ్ దేవరకొండ తన స్టార్డమ్ ను కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తు ఉన్నాడనే చెప్పవచ్చు.
ఇక అభిమానుల్లో ఇప్పుడు ఓ సందిగ్ధం నెలకొంది.
పూరి జగన్నాథ్
సినిమా పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి
సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే సందేహం ఉంది. మొన్నటి దాకా
సుకుమార్ చిత్రమే ఆయన చేసే తదుపరి చిత్రం అని వార్తలు రాగా ఇప్పుడు పుష్ప
సినిమా షూటింగ్ ఉండటంతో ఆ చిత్రం కొంచెం ఆలస్యంగా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఈ గ్యాప్ లో
విజయ్ దేవరకొండ శివ నిర్వాణ తో చేసే విధంగా ఆలోచన చేస్తుండగా ఈ చిత్రం యొక్క కథ మీద భారీగా చర్చలు నడుస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో
హీరోయిన్ గా
కియారా అద్వాని ని
హీరోయిన్ గా ప్రయత్నిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతుంది. త్వరలోనే
బాంబే కి వెళ్లి ఆమెకు కథ చెప్ప పోతున్నారట. స్టార్ గా ఎదిగిన
విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరోయిన్ లతో సినిమాలు చేయడం విశేష .