ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ లు బాగా పెంచేసారు నటీ నటులు. హీరో, హీరోయిన్ లు మాత్రమే కాదు డైరెక్టర్, కెమెరా మెన్ , మ్యూజిక్ డైరెక్టర్ లు కూడా భారీ రేంజ్ లోనే పారితోషకాలు పుచ్చుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైర గా మారింది. ఇక్ ఈ వార్త విన్న వారు షాక్ అవుతున్నారు. రైటర్ గా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తరువాత  డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతూ వస్తున్నారు. ఢిఫరెంట్ కంటెంట్ లతో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇక సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్న సంగతి తెలిసిందే.  కానీ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం . ఒకరు అల్లు అర్జున్ .. మరొకరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇక ఈ కారణంగానే ఆయన అడగ్గానే  మళ్ళీ రైటర్ గా మారిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. యస్.. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించి  విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా భీమ్లా నాయక్.  

పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాకి  స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఇందుకు గాను ఆయన అందుకున్న పారితోషకం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా 15 కోట్లు  చార్జ్ చేసాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ భార్య గా కనిపించనుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12 న మన ముందుకు రాబోతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి భారీ విజయాని నమోదు చేస్తుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: