హిందీ చిత్రసీమలో హీరోయిన్ నంబర్ వన్ గా పిలుచుకునే దీపికా పదుకొణెతో శకున్ బాత్రా సినిమాకు గ్రహణం పట్టేలా కనిపిస్తోంది. అద్భుతమైన స్టార్ కాస్ట్ కారణంగా శకున్ బాత్రా దర్శకత్వంలో ఇంకా టైటిల్ ఖరారు చేయని కొత్త చిత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా గురించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్‌గా విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. సినిమా డైరెక్ట్ టు ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉందని ముంబై చిత్ర పరిశ్రమలో తాజాగా బజ్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆనంద్ షీలాపై షకున్ బాత్రా తీసిన డాక్యుమెంటరీ నెట్‌ ఫ్లిక్స్‌లో పెద్దగా హిట్ అవ్వకపోవడం దీనికి కారణం అంటున్నారు. అందుకే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు బాత్రా దర్శకత్వాన్ని నమ్మలేకపోతున్నారట. దీంతో చేసేది లేక చిత్రబృందం ఓటిటి విడుదలకు సిద్ధమైందట. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తం గా నిర్మిస్తున్నారు. అయితే కరణ్ జోహార్ తన సంస్థ కొత్త చిత్రాలను విడుదల చేయడానికి వయాకామ్ 18తో భారీ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం కరణ్ జోహార్ వయాకామ్ 18 స్టూడియోస్ లో నాలుగు సినిమాలు చేయబోతున్నాడు. అయితే దీపికా చిత్రాన్ని విడుదల చేయడానికి ఈ స్టూడియో నిరాకరించిందని పుకారు ఉంది. కాగా ఇంకా టైటిల్ రివీల్ చేయని ఈ సినిమా ఆధునిక సంబంధాల చుట్టూ తిరిగే కథతో యూత్ టార్గెట్ గా రూపొందుతోంది.

తాజాగా దీపికా హైదరాబాద్ కు చేరుకుంది. ప్రభాస్ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ మూవీ "ప్రాజెక్ట్ కే" షూటింగ్ కోసం ఈ బ్యూటీ ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: