సినీ చిత్ర పరిశ్రమలో గత కొన్నిరోజులు బట్టి అల్లు కుటుంబం నందమూరి కుటుంబాల మధ్య సన్నిహిత సబంధాలు పెరిగాయి. అయితే ఇంతకు ముందు అక్కినేని ఫ్యామిలీ ఇంకా మెగా ఫ్యామిలీ సన్నిహితంగా ఉన్నట్లు చాలామంది అనుకున్నారు. ఇటీవల అల్లు అరవింద్ అక్కినేని వారసులైన అక్కినేని అఖిల్ నాగచైతన్యతో సినిమాలు నిర్మించి వారితో వారి కుటుంబాలతో కలిసిపోయాడు అల్లు అరవింద్. అంతేకాకుండా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో  కలిసే చేయడం వల్ల వారి మధ్య ఉన్న బంధం ఇంకా బలపడింది. అయితే ఇంతకాలం అల్లుఅరవింద్ అక్కినేని కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాడు..

మరి ఇప్పుడు నందమూరి కుటుంబంతో దగ్గర అవుతున్నాడు అల్లు అరవింద్. అయితే అల్లు అరవింద్ తండ్రి రామలింగయ్య సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం ద్వారా నందమూరి బాలకృష్ణ ఓటి ప్లాట్ ఫార్మ్ గా ఇప్పుడు ఆహా అన్ స్టాపబుల్ పేరుతో ఓ షో చేస్తున్న విషయం  మనందరికీ తెలిసిందే.  ఇటీవల అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ తో ఒక సినిమా ప్లాన్ చేశారని సమాచారం. నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో త్వరలోనే రానుందని తెలుస్తోంది.

అయితే అఖండ సినిమా తర్వాత ప్రస్తుతం బాలకృష్ణ  గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అల్లు అరవింద్ నిర్మిస్తున్న,గీతా ఆర్ట్స్ బ్యానర్ పై,సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా వస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ నటించిన ఈ సినిమాకి 'రానే వస్తాడు రామయ్య' అనే టైటిల్ ను ఈ సినిమాకి  పెట్టే అవకాశాలున్నట్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో కాదో అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: