టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పవర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమాను సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ హీరోగా హీరోయిన్గా నిత్యామీనన్ నటిస్తున్నారు. ఇకపోతే ప్రధాన పాత్రలో నటిస్తున్న దగ్గుబాటి రానా కి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో లో సూపర్ హిట్ అందుకున్న అయ్యప్పనుమ్ కోషీయం సినిమాను రీమేక్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు  త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే  అందించగా..తమన్ సంగీతం అందిస్తున్నారు.

 అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు పాటలు విడుదల కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు తెగ ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ నటించిన ఈ సినిమాకి సంబంధించి అడవితల్లి అనే టైటిల్ తో మరో పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ పాటను భీమ్లా నాయక్ సోల్ గా  వర్ణించడం విశేషం. ఇప్పటికే విడుదలైన పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ పాటకి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే..

గతంలో భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పాట పాడాలని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ పాటను పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట మాస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ పాట పాడిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి ఇక త్వరలోనే ఈ పాటకు సంబంధించి చిత్ర యూనిట్ కు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ.. తమ అభిమాన హీరో పాడిన పాట కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: