మహేష్ బాబు, పరశురామ్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుండగా కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం పూర్తిగా తన హెయిర్ స్టైల్ మార్చిన సూపర్ స్టార్ మహేష్, సినిమాలో ఒక డిఫరెంట్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో విలన్ గా ప్రముఖ నటుడు సముద్ర ఖని యాక్ట్ చేస్తుండగా ఇంత పాత్రల్లో సుబ్బరాజు, వెన్నెల కిషోర్, జగపతి బాబు నటిస్తున్నట్లు సమాచారం.

ఇక సినిమాకి సంబంధించి కేవలం కొన్ని సీన్స్, అలానే రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని, అవి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న విధంగా పక్కాగా సినిమాని ఏప్రిల్ 1న థియేటర్స్ లో తీసుకువచ్చేలా యూనిట్ పక్కాగా ప్లాన్ చేస్తోందట. అయితే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో మహేష్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఆ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనుండగా థమన్ సంగీతం అందించనున్నారు.

అయితే ఈ సినిమా కథ ప్రకారం మూవీ ని చాలా వరకు ఇంగ్లాండ్ లో తీయనున్నారని, అలానే సర్కారు వారి పాట కంటే కూడా మహేష్ బాబు ఈ మూవీలో మరింత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని, త్వరలోనే ఆ లుక్ కోసం మహేష్ ప్రత్యేకంగా సిద్ధం కానున్నారని అంటున్నారు. ప్రస్తుతం మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ ఈ సినిమాని త్వరలో ముహూర్తం జరిపి జనవరి నెలాఖరులో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. ఎంతో భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ మూవీ మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: