పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన యువ దర్శకుడు సాగర్ కె చంద్ర ఆయన తో ప్రస్తుతం తీస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళం లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న భీమ్లా నాయక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా మరొక ముఖ్య రోల్ లో దగ్గుబాటి రానా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, స్క్రిప్ట్ అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై సూర్యదేవర నాగ వంశీ ఎంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే నాలుగు సాంగ్స్ రిలీజ్ కాగా అవి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకుని సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసాయి. కాగా ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల రెండవ వారం లో యూనిట్ విడుదల చేయనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ట్రైలర్ కట్ కి సంబందించిన వర్క్ ప్రారంభించిన యూనిట్ త్వరలోనే పక్కాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనుందట.

ఇక ఇది ఇద్దరు వ్యక్తుల ఈగోల మధ్య సాగే కథాంశంతో తో తెరకెక్కిన సినిమా అని, అలానే భీమ్లా నాయక్ పాత్ర లో పవన్, డ్యానియేల్ శేఖర్ పాత్రలో రానా ఇద్దరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారని, పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీస్తున్నారని రిలీజ్ తరువాత ఈ మూవీ సూపర్ హిట్ ఖాయం అని ఇన్నర్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నట్లు టాక్. కాగా ఈ సినిమాని జనవరి 12న విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: