2000 వ సంవత్సరం నుండీ ఇద్దరు హీరోలు ప్రేమ కథా చిత్రాలు చేస్తూనే స్టార్ డం ను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.వాళ్ళు మరెవరో కాదు ఉదయ్ కిరణ్ మరియు తరుణ్.
'నువ్వే కావాలి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తూనే ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను కొట్టి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడట తరుణ్. మరో పక్క అదే ఏడాది 'చిత్రం' మూవీతో ఎంట్రీ ఇస్తూనే ఆ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడట ఉదయ్ కిరణ్. అటు తర్వాత ఇతను నటించిన 'నువ్వు నేను' 'మనసంతా నువ్వే' చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాయని తెలుస్తుంది..

ఉదయ్ కిరణ్ కు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టాయని సమాచారం.. వీళ్ళిద్దరి కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో వీళ్ళతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలని ఓ స్టార్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేశారని తెలుస్తుంది.ఆయన మరెవరో కాదు యం.ఎస్.రాజు గారని సమాచారం.. ఉదయ్ కిరణ్ తో 'మనసంతా నువ్వే' చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకున్న రాజు గారు అటు తర్వాత ఉదయ్ కిరణ్ తో 'నీ స్నేహం' మూవీ కూడా చేశారట.. 'మనసంతా నువ్వే' బ్లాక్ బస్టర్ కావడంతో 'నీ స్నేహం' పై భారీ అంచనాలు నెలకొన్నాయని సమాచారం..2002 వ సంవత్సరం నవంబర్ 1న 'నీ స్నేహం' విడుదలయ్యిందట. మొదటి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ అయితే నమోదయ్యాయి కానీ  ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిందట.

దీనికి ప్రధాన కారణం తరుణ్ అని రాజు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారని సమాచారం.. 'నీ స్నేహం' లో కీలకమైన స్నేహితుడి పాత్రకి ముందుగా తరుణ్ ను అనుకున్నారని తెలుస్తుంది.. కానీ కొన్ని కారణాల వల్ల అతను నొ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని జతిన్ గ్రేవాల్ తో ఆ పాత్రని చేయించారని సమాచారం.దాంతో ఈ సినిమా అటు లవ్ స్టోరీ కాక ఫ్రెండ్ షిప్ బేస్డ్ మూవీ కాకుండా పోయిందని ప్రేక్షకులు విమర్శించినట్టు నిర్మాత యం.ఎస్.రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. ఒకవేళ తరుణ్ కనుక చేసి ఉంటే 'నీ స్నేహం' సూపర్ హిట్ మూవీ అని కూడా ఆయన తెలిపారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: