‘అఖండ’ ఫలితం తెలిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 17న విడుదలకాబోతున్న ‘పుష్ప’ పై ఉంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టీజర్ పాటలు విపరీతంగా జనానికి నచ్చడంతో ఈమూవీ పై కూడ భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య అనుకోకుండా ‘పుష్ప’ కు ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన వ్యూహాత్మక దాడి ఎదురౌతోంది.  


నిజానికి ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయాలని భావించారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఈ ట్రైలర్ విడుదల ఈ నెల 9కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే అదే డేట్ కు ‘పుష్ప’ ట్రైలర్ ను కూడ విడుదల చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఒకేరోజు ఈ రెండు క్రేజీ సినిమాల ట్రైలర్స్ విడుదల అయితే అది సోషల్ మీడియాలో ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ ల మధ్య వార్ గా మారే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


అంతేకాదు ఈరెండు ట్రైలర్స్ ను పోల్చి చూస్తూ సగటు ప్రేక్షకుడు కామెంట్స్ చేసే ఆస్కారం ఉంది. దీనితో ఈ రెండిటి మధ్య ఒక రోజు గ్యాప్ ఉంటే బాగుంటుందని ఈమూవీ బయ్యర్లు మూవీ నిర్మాతలకు సూచిస్తున్నట్లు టాక్. అయితే ఈరెండు ట్రైలర్ల క్లాష్ ఖాయం అని అంటున్నారు. వాస్తవానికి ఈ రెండు సినిమాల మీద అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.


దీనికితోడు ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలు కావడంతో ఈసినిమాల పై అటు సుకుమార్ ఇటు రాజమౌళి చాల కష్టపడటమే కాకుండా చాల ఆశలు కూడ పెట్టుకున్నారు. కరోనా పరిస్థితులు వల్ల ఇప్పటికీ ఈ రెండు సినిమాల విడుదల అనేకసార్లు వాయిదా పడి ఇప్పటికి విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమా లపై కూడ చాల భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. దీనితో ఈ ట్రైలర్స్ వార్ లో విజేత ఎవరు అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: