తెలుగు సినిమా చరిత్రలో డైరెక్టర్ మరియు హీరో కాంబినేషన్ లో ఒక సినిమా హిట్ అయితే మళ్లీ మళ్లీ అదే కాంబోలో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే సమయంలో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు కూడా ఎక్కువ అంచనాలు ఉంటాయి. అయితే ఈ ఫార్ములా ఆన్ని సార్లు వర్క్ ఔట్ కాదు. ఈ విషయం చాలా సార్లు కొందరి డైరెక్టర్ మరియు హీరోల కాంబినేషన్ లో రుజువు అయింది. అయితే ఒక కాంబినేషన్ మాత్రం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ఉంది. ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరియు నందమూరి నట సింహం బాలయ్యలు మొదటి సారి 'సింహ' సినిమాతో జత కట్టారు. అప్పట్లో సింహ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

సినిమా ఇండస్ట్రీ టాప్ గా నిలిచి బాలయ్య స్టామినాను రెట్టింపు చేసింది. బోయపాటి సినిమాలో ఎక్కువగా భారీ డైలాగ్స్, యాక్షన్ ఘట్టాలు, అధ్బుతమైన కథనం లాంటి అంశాలు హైలైట్ గా ఉంటాయి. ఆ తర్వాత రెండవ సారి 'లెజెండ్' సినిమాను బాలయ్యతో తీశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా వరుస సినిమాలు వీరిద్దరి కలయికలో హిట్ అయ్యాయి.  ఈ రెండు సినిమాలతో బోయపాటి బాలయ్య కాంబో అంటే ఖచ్చితంగా హిట్ అనేంత స్థాయికి చేరుకుంది. అప్పటి నుండి ఎప్పుడెప్పుడు మళ్లీ వీరిద్దరి నుండి సినిమా వస్తుంది అని ఎంతగానో ఎదురుచూశారు. అయితే అందరి ఆశలకు తగ్గట్టుగా బోయపాటి బాలయ్య కాంబో మళ్లీ ఊపిరి పోసుకుంది.

'అఖండ' రూపంలో... రెండు సినిమాల తర్వాత వచ్చిన చిత్రం కావడంతో మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సారి కథ వేరే లెవెల్ లో ఉంది. రెండు రోజుల క్రితం ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందంటూ చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో హిందూ ధర్మం గురించి చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. బాలయ్య నటనకు ప్రేక్షకులంతా మంత్ర ముగ్ధులు అవుతున్నారు. కట్ చేస్తే వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. వీరిద్దరి సక్సెస్ మంత్ర ఏమై ఉంటుందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. బాలయ్యని బోయపాటి ల మధ్య ఉన్న నమ్మకం విశ్వాసమే వారిని వరుస హిట్ లు వచ్చేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: