పంజాబీ కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రులు టీచర్లు. ఏం పుట్టింది పంజాబీ లోనయినా పెరిగింది మాత్రం ఢిల్లీలో. ఇలా వయసులోనే ముఖానికి రంగు వేసుకుని పలు పంజాబీ సీరియల్ లో నటించి బాల నటిగా మారింది. ఆమె తల్లికి యాంకరింగ్ చేయాలనే ఆలోచన ఉండడంతో పాయల్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. జర్నలిజం లో డిగ్రీ పూర్తయ్యాక యాంకరింగ్ చేసింది. చాలా సమయంలోనే మోడలింగ్ చేసి సినిమాల్లో నటించాలనే తపనను పెంచుకుంది.
మొత్తానికి చేతిలో లక్ష రూపాయలు పట్టుకొని సినిమా అవకాశాల కోసం తొలిసారి ముంబైలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు ప్రకటనల్లో అందించడమే కాకుండా యాంకరింగ్ కూడా చేసింది. తెలుగు తమిళ చిత్ర సీమల్లో ఎన్నో ఆడిషన్లో హాజరైన ప్రతి చోట తిరస్కరణ లు ఎదుర్కొంది. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా 2010లో బాలీవుడ్ లో సీరియల్ లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ తర్వాత బుల్లితెరపై నాయకురాలిగా రాణించింది. 2018లో సౌత్ లో ఆర్ఎక్స్ 100 సినిమా అవకాశం వచ్చింది. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత గాని ఆమెకి మొదటి హిట్ దక్కలేదు. ఇప్పటికీ టాలీవుడ్ లో తనకు స్టార్ హీరోయిన్ హోదా అందలేదని చెప్పాలి. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న పాయల్ కి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.