తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అందగాడు శోభన్ బాబు. జయలలిత ,శోభన్ బాబు కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా డాక్టర్ బాబు. శివ షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు జయలలిత తల్లి మరణించింది. తల్లి ఉన్నంతవరకు జయలలితకు సంబంధించిన అన్ని విషయాలు ఆమె చూసుకునేది. ఆ తర్వాత శోభన్ బాబు లో ఆమె తన తల్లిని చూసుకునేదట. ఆ విషయం గురించి శోభన్ బాబు స్క్రీన్ ప్లే సినిమాస పత్రిక లో.."నేను నా కథానాయికలు"అనే శీర్షికలో ఇది వ్యక్తం చేశారు.


ఊటీలో డాక్టర్ బాబు సినిమా షూటింగ్ లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. జయలలిత రెండు రోజుల షూటింగ్ తర్వాత శోభన్ బాబుతో అన్న మాటలను ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నారు.. చెప్పలేనంత దిగులుతో నిండి ఉండి, బరువైన నా మనసును మీ జోకులతో.. నా మనసు తేలిక చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు చాలా నార్మల్గా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలని, అందరితోనూ కలిసిపోవాలని, అందరితో ఆహ్లాదకరంగా ఉండాలని ఇప్పుడు అనిపిస్తోంది నా మనసు అని తెలిపిందట.ఈ ఈ విషయాన్ని తన డైరీలోనే రాశావు శోభన్ బాబు.

జయలలిత తల్లి మరణించి ఒక ఏడాది కూడా కాలేదట.. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నట్లుగా ఉంది అని తెలియజేసిందట. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు నాకు.. ఉన్నవాళ్లు అంతా తన డబ్బు కోసమే ఆశపడే వాళ్ళు అని తెలియజేసిందట జయలలిత శోభన్ బాబుకు.బంధువులైన తన వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే.. తనని కొన్ని లక్షలు మోసం చేసి దోచుకొని వెళ్లిపోయారని తెలియజేసిందట. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని తెలిసిందట. ఇలాంటి ఎన్నో బాధలు పడుతున్న నాకు మీరు వచ్చాక అలాంటి బాధ నుంచి విముక్తి కలిగిందని.. తెలియజేసింది అంటూ ఆ డైరీలో రాసుకున్నాడు శోభన్ బాబు. మా అమ్మ పక్కనే ఉంటే ఎంత ధైర్యం గా ఉంటుందో మీ పక్కన ఉంటే నాకు అంత ధైర్యంగా ఉంటుందని తెలిపిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: