వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ఉప్పెన. మెగా
హీరో గా భారీ గా లాంచ్ అయిన వైష్ణవ్ ఈ
సినిమా తో ఏ స్థాయిలో విజయం అందుకున్నాడో అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ
సినిమా వారి అంచనాలకు తగ్గట్లుగా నమ్మకానికి తగ్గట్లుగా ఘన విజయం సాధించి భారీ వసూళ్లను అందుకుంది. తొలి లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడటానికి ఈ
సినిమా ఎంతో దోహదపడింది.
తొలి సినిమాతోనే వంద కోట్ల హీరోగా పేరుగాంచిన
వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత సినిమాలతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో అన్న ఆశ్చర్యాన్ని ప్రేక్షకులు వ్యక్తపరిచారు. ఈ స్థాయిలో తొలి సినిమాతో సంచలనం సృష్టించిన
హీరో ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. ఇక ఈ
సినిమా విజయం తర్వాత ఆయన నటించిన రెండవ
సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ విధంగా క్రిష్ దర్శకత్వంలో ఆయన తన రెండవ
సినిమా కొండపొలం అనే చిత్రాన్ని చేశాడు. ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఈ
సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అనుకున్నాడు.
కానీ అనూహ్యంగా
వైష్ణవ్ తేజ్ కు ఈ
సినిమా పెద్ద ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది. ప్రేక్షకులకు ఏ మాత్రం ఈ
సినిమా నచ్చలేదు. మెజారిటీ భాగం ప్రేక్షకులకు ఈ
సినిమా బోర్ కొట్టడంతో ఈ చిత్రాన్ని ఫ్లాప్ గా కొట్టిపారేశారు.
రకుల్ అందాలు,
కీరవాణి సంగీతం కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు. దాంతో
వైష్ణవ్ తేజ్ తొలి
సినిమా మాయాజాలం ఇక్కడ పని చేయకపోవడంతో మళ్ళీ హీరోగా తన కెరీర్ ముందుకు తీసుకువెళ్ళే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.