టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మొదట్లో పెద్ద హీరోలు మాత్రమే ఈ పాన్ ఇండియా సినిమాలలో చేసే విధంగా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు చిన్న హీరోలు సైతం ఈ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు డజను సినిమాలకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

ప్రభాస్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ మహేష్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు ఈ తరహా సినిమాలు చేస్తుండడం విశేషం. ఈ పరిణామం పట్ల టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఆ స్థాయిలో కథ ఉండాలి లేదంటే దాన్ని పాన్ ఇండియా సినిమాగా పరిగణించలేము. విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ అనే ఓ సినిమా తెరకెక్కుతోంది. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ చిత్రం పై భారీ అంచనాలను పెంచింది. వచ్చే వేసవిలో ఈ చిత్రం విడుదల కాబోతుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంచి పూరి జగన్నాథ్ సినిమా పట్ల క్రేజ్ ను రోజురోజుకు పెంచుకుంటూ పొతున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. మరి టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకుని వస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: