టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్
ఇండియా సినిమాలు తెరకెక్కడం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మొదట్లో పెద్ద హీరోలు మాత్రమే ఈ పాన్
ఇండియా సినిమాలలో చేసే విధంగా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు చిన్న హీరోలు సైతం ఈ పాన్
ఇండియా సినిమాలను చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఆ విధంగా తెలుగు
సినిమా పరిశ్రమలో ఇప్పుడు డజను సినిమాలకు పైగా పాన్
ఇండియా సినిమాలు ఉన్నాయి.
ప్రభాస్
విజయ్ దేవరకొండ అల్లు
అర్జున్ మహేష్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు ఈ తరహా సినిమాలు చేస్తుండడం విశేషం. ఈ పరిణామం పట్ల
టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఆ స్థాయిలో కథ ఉండాలి లేదంటే దాన్ని పాన్
ఇండియా సినిమాగా పరిగణించలేము.
విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ అనే ఓ
సినిమా తెరకెక్కుతోంది. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా
పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ
సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ చిత్రం పై భారీ అంచనాలను పెంచింది. వచ్చే వేసవిలో ఈ చిత్రం విడుదల కాబోతుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంచి
పూరి జగన్నాథ్
సినిమా పట్ల క్రేజ్ ను రోజురోజుకు పెంచుకుంటూ పొతున్నాడు.
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో
మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. మరి
టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన
విజయ్ దేవరకొండ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకుని వస్తాడా అనేది చూడాలి.