ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో  మల్టీస్టారర్ మూవీ అయినా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా గత కొన్ని వారాల నుంచి జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్ , సమంత వంటి తారలు వచ్చి సందడి చేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోకి హాజరయ్యారు. ఈ షో కి సంబంధించిన ప్రోమో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ప్రోమోలో ఒకే వేదికపై ఎన్టీఆర్ ,మహేష్ బాబు అలరించబోతున్నారు.. ఈ ప్రోమో లో  ఎన్టీఆర్ ఇటు మహేష్ బాబు ఎవరికి ఎవరు.. ఎక్కడ తగ్గకుండా పంచుల సునామీ వర్షం  కురిపించారు. ఈ ప్రోమో లో మహేష్ బాబును ఎన్టీఆర్ ప్రశ్నలు అడిగిన సందర్భంలో.. ఇక మహేష్ ఎన్టీఆర్ తో  అటు తిప్పి, ఇటు తిప్పి ఎందుకు అడుగుతున్నారు అని అడగగా.. ఇక ఎన్టీఆర్ కూడా సరదాగా అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.. ఎన్టీఆర్ ఇలా అనడంతో మహేష్ బాబు మీ కన్నా మీ గురువుగారు చాలా బెటర్ అంటూ మరో కౌంటర్ వేసాడు. ఇలా పంచులతో సరదాగా సాగిన ఈ ప్రోమో అభిమానులు ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.ఇక ఈ ప్రోమోలో మహేష్ బాబుకు సంబంధించిన అన్ని రహస్యాలను ఎన్టీఆర్ రాబట్టడానికి ప్రయత్నం చేశారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ..ఆయన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే మోకాలు సర్జరీ కోసం కొద్ది రోజులపాటు సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ షో పూర్తయిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: