నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం అఖండ సినిమా గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎవరి నోట విన్నా కూడా అఖండ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అఖండ సినిమా హాట్ టాపిక్ గా మారింది.

 ఇప్పటివరకు బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో నటించారు అయినప్పటికీ అఖండ సినిమా మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అని అంటున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమాను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ అభిమానులు సైతం థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అసలు విషయానికొస్తే బాలకృష్ణ నటించిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఓ రేంజ్ లో అమ్ముడయ్యాయని  తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్ల రూపాయలు మాత్రమే పొందినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో తెలియదు ఈ విషయాన్ని అధికారికంగా  ప్రకటించాల్సి ఉంది.

అయితే బాలయ్య అఖండ సినిమాలో రెండు పాత్రల్లో దర్శనమిచ్చాడు.. రెండు పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉన్నప్పటికీ రెండు పాత్రల్లోనూ తనదైన శైలిలో తన యాక్షన్ తో డైలాగ్స్ తో అందరిని మైమరిపించారు బాలయ్య. అయితే బాలయ్య అఖండ  సినిమా ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. బాలయ్య ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషించగా వీరితో పాటు మరో కీలక పాత్రలో విలన్ గా శ్రీకాంత్ అందరినీ మైమరిపించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. బాలయ్య అఖండ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మరో సినిమా కూడా మొదలు పెట్టేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: