ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై  తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన‌ది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ షోలో పాల్గొనడంపై ఫైర్ అవ్వ‌డ‌మే కాక‌.. నోటీసులు  కూడా జారీ చేసింది. కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం విధిత‌మే.అయితే కమల్ హాసన్ స్వయంగా తనకు కోవిడ్ -19 సోకింది అంటూ ట్వీట్ చేసారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స  పొందారు. క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల యూఎస్ వెళ్లి  తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయిన‌ది.  కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ను ప్రారంభించారు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని పేర్కొంటున్నారు. ముఖ్యంగా యూఎస్ఏ నుంచి వ‌చ్చాకనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో నే చికిత్స పొందిన కమల్ డిసెంబర్ 4న ఆసుప‌త్రి  నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని.. మరొక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన విషయాన్నీ కూడా కమల్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండ‌గానే.. అలా డిశ్చార్జ్ అయ్యారో లేదో ఇలా తాను హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ తమిళ్ 5″లో పాల్గొన్నారు క‌మ‌ల్‌. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన  క‌నిపించ‌డం గమనార్హం.

కరోనా తగ్గినప్పటికీ కనీసం వారం రోజులు ఎవరినీ కలవకుండా ఉంటే మంచిదన్న విషయంఅంద‌రికీ తెలిసిందే.  అయితే ఈ అగ్రహీరో ఆ నిబంధనను ఉల్లంఘించి   షూటింగ్ లో పాల్గొనడంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న న‌టుడు ఇలా చేయ‌డం ఏమిట‌ని క‌మ‌ల్ గురించి ద‌క్షిణాది రాష్ట్రాల అభిమానులు చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇదిలా ఉండ‌గా తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. కాగా కమల్ కోలుకునే వరకు ఈ షోను సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ చేసిన‌ది త‌మిల బిగ్‌బాస్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: