ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్బాబు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్, జి ఎం బి క్రియేషన్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమా ఓ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సర్కారు వారి పాట సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడు పరశురామ్ దర్శకత్వాన్ని ని ఏకంగా పూరిజగన్నాథ్ దర్శకత్వంతో పోల్చాడు.

' సర్కార్ వారి పాట సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఉండే స్టైల్ మరియు ఎసెన్స్ ఉంటాయి. ఇలాంటి ఒక పూర్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ సినిమా చేసి చాలా కాలమైంది' అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. దీంతో మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మహేష్ బాబు కామెంట్స్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సినిమా లో కోలీవుడ్ నటుడు సముద్రఖని విలన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: