చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్.. తెరకెక్కిస్తున్న తాజా చిత్రం బోలా శంకర్. ఈ మూవీ తమిళంలో వేదాళం నుంచి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ఈ సినిమాలో తమన్నా ఎంపికైంది. ఇక చెల్లెలు పాత్ర కోసం ఈ సినిమాలో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం యాంకర్ రష్మీ ని తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మహతి సాగర్ అందిస్తున్నారు. ఇక చిరంజీవితో కలిసి రష్మీ ఈ సినిమాలో డాన్స్ చేయనుంది.

అయితే కొద్ది రోజులుగా రష్మి సినిమాలలో నటించలేదు. ఎక్కువగా బుల్లితెర పైన కొన్ని షో లను చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే చిరంజీవితో కలిసి చిందులు వేయడానికి  రష్మి తన మూడు రోజుల కాల్షీట్లను డైరెక్టర్ కు అందించినట్లు సమాచారం. రష్మి ఇందులో పాట కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా..1.5 కోట్ల రూపాయలతో ఒక సెట్టు నిర్మించి, అందులో ఐటెం సాంగ్ ను నిర్మించబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది.

రష్మి హీరోయిన్ గా ఉన్నప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ పారిశుద్ధ్యం తీసుకుంటోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మూవీ కోసం ఎంతటి ఖర్చుకైనా చేస్తామని నిర్మాత అని తెలియజేశారు. ఈ సినిమాకోసం నటీనటులు ఎంత డిమాండ్ చేసినప్పటికీ ఆయన కేవలం చిరునవ్వుతోనే సరే అని చెబుతున్నారట. ఒకవేళ ఈ సినిమా భారీ సక్సెస్ అయ్యి.. ప్రేక్షకులను అభిమానులను మెప్పిస్తే రష్మికి మరికొన్ని ఐటమ్సాంగ్లో నటించే అవకాశం ఎవరు అలానే వస్తాయి అని చెప్పవచ్చు.

ఇక వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి ఐటెం సాంగులో చిత్రీకరించబోతున్నట్లు గా  ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది.ఏది ఏమైనా అటు కీర్తి సురేష్, రష్మీ దశ తిరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: