టాలీవుడ్
సినిమా పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతూ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తు ముందుకు దూసుకుపోతున్నారు అల్లు అరవింద్. అల్లురామలింగయ్య తనయుడు
సినిమా పరిశ్రమలోకి వచ్చి నిర్మాణరంగంలో సెటిల్ అయిన
అల్లు అరవింద్ ఆ తర్వాత
మెగాస్టార్ చిరంజీవి పవన్
కళ్యాణ్ అల్లు అర్జున్,
రామ్ చరణ్ వంటి హీరోలు నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి నిర్మాతగా తన కంటూ ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్నాడు.
స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈయన స్థాపించిన గీతాఆర్ట్స్ బ్యానర్ లో
సినిమా చేయాలని అనుకునే వారే. సొంత వారసులు హీరోలుగా ఉన్నా కూడా వారితో మాత్రమే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసి వారిలోని మైత్రి భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అల్లు అరవింద్. అంతేకాకుండా ఈయన ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ ను కూడా ఏర్పరిచి తెలుగువారందరికీ ఓ టీ టీ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్నారు.
భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన
గీతా ఆర్ట్స్ సంస్థ చేతిలో ప్రస్తుతం కొన్ని భారీ సినిమాలు చేస్తూ ఉండగా ఇప్పుడు మరొక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా
అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో హీరోగా మహేష్ బాబు మరియు
అల్లు అర్జున్ నటించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రోజుల్లో ఒక
హీరో తో
సినిమా చేయడం అంటేనే చాలా గగణమైయిపోయిన విషయం. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోలను పెట్టి అతి పెద్ద భారీ మల్టీస్టారర్
సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలో ఆరి తేరిపోయిన
గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వస్తుందో చూడాలి.