ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు పాన్
ఇండియా సినిమాలు తెలుగులో తెరకెక్కడం ఎక్కువ అవుతున్నాయి. దాదాపు అందరు హీరోలు కూడా ఇప్పుడు పాన్
ఇండియా సినిమాలను మాత్రమే చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా
ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలు చేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచారు. వాటిలో ముందుగా రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటి తర్వాత
ప్రభాస్ తన సినిమాలను చకచకా పూర్తి చేసి ముందుకు దూసుకు వెళుతున్నాడు.
ప్రభాస్ సలార్ చిత్రాన్ని చివరి దశకు తీసుకు రాగా రాధే
శ్యామ్ చిత్రం వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తుండటం విశేషం.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను
కేజిఎఫ్ సినిమాను నిర్వహించిన సంస్థ నిర్మిస్తుండటం విశేషం. ఇక
బాలీవుడ్ లో ఆయన ఎంట్రీ చేస్తున్న
ఆది పురుష్ చిత్రం కూడా చివరిదశ షూటింగ్ లోనే ఉంది.
నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కే చిత్రం అలాగే
సందీప్ రెడ్డి తో చేసే స్పిరిట్
సినిమా షూటింగ్ లలో త్వరలోనే
ప్రభాస్ పాల్గొననున్నాడు. ఈ విధంగా ఒకేసారి నాలుగు సినిమాలలో నటిస్తూ
ప్రభాస్ తాను ఎప్పుడూ లేని విధంగా తనని తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే
ప్రభాస్ ను కూడా ఓ సమస్య వెంటాడుతోంది. వరుస పాన్
ఇండియా సినిమాలు అయితే చేసుకుంటూ దూసుకుపోతున్నాడు కానీ చేసిన సినిమాలకు రీ షూట్ లు పెట్టకుండా ఉండడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటికే రాధే
శ్యామ్ చిత్రం పలు సందర్భాలలో రీ షూట్ కు గురికాగా ఇప్పుడు ఎన్నో అంచనాలతో రాబోతున్న సలార్
సినిమా కూడా రీ షూట్ అవ్వడం గమనార్హం. ఎందుకు
ప్రభాస్ సినిమా కు ఈ రీ షూట్ లు జరుగుతున్నాయో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ఈ విధంగా రీ షూట్ లు చేయడం వల్ల సినిమాపై క్రేజ్ తగ్గుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.