సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉంది అంటే అది నాగచైతన్య-సమంత విడాకుల మ్యాటర్ నే. వీళ్ళు విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి దాదాపు రెండు నెలలు పైనే కావస్తున్నా ఈ విషయం మాత్రం నెట్టింట ఇప్పటికే హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది. దీనికి తగ్గటు సమంత కూడా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెట్టడం తో అమ్మడు ప్రతి రోజు హెడ్ లైన్స్ లో క్రమం తప్పకుండా కనిపిస్తుంది.

ఇక రీసెంట్ గా అమ్మడు చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. సమంత ఇలా చేస్తుందని అనుకోలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి సమంత నాగార్జున పరువు పోయేంతలా ఏం చేసిందో తెలుసా.. మాజీ మొగుడు, మామ కంటే అల్లు అర్జున్ కే ప్రాధాన్యత ఇచ్చింది. కనీసం నాగచైతన్య బర్త డే కి కూడా విష్ చేయని సమంత..పుష్ప సినిమా ట్రైలర్ కి స్పదించింది. దీంతో అల్లు ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా..అక్కినేని అభిమానులు సమంత పై మండిపడుతున్నారు.

నిజానికి సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నా  అని అనౌన్స్ చేసినప్పటి నుండి.. అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించి అస్సలు ఏం మాట్లాడటం లేదు. నాగ చైతన్య  లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన పట్టించుకోలేదు..అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయిన స్పందించలేదు.. అంతేకాదు మాజీ మామ నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమా టీజర్ విడుదలైన కూడా ఏం రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు. కానీ ఫస్ట్ టైం  అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కి మాత్రం ట్వీట్ చేసారు. పుష్ప ట్రైలర్ మీద స్పందిస్తూ " తగ్గేదే లే." .. అంటూ అల్లు అర్జున్  ట్వీట్ ను రీ-ట్వీట్ చేసింది సమంత. దీంతో సమంత మరోసారి నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: