జెస్సీ.. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడున్న చాలు అని అనుకుంటున్నారు యువత. ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టి..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు గెలుచుకున్న కంటెస్టెంట్ మోడల్‌ జెశ్వంత్‌. అందరు ముద్దుగా జెస్సీ అని పిలుస్తారు. బిగ్ బాస్ 5 రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫుల్ కూల్ గా ఉంటూ చిల్ అవుతూ ఫ్రెండ్ షిప్ కి ఎక్కువ విలువ ఇస్తారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు షణ్ముఖ్-సిరి లతో కలిసి బాగా ఎంజాయ్ చేసి..అల్లరి చేసిన జెస్సీ..ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల హౌస్ నుండి బయటకు వచ్చేసారు.

ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ గా మారింది. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జెస్సీ ఇక రోజు రోజుకు అలాంటి వార్తలు ఎక్కువ అయిపోతున్న క్రమంలో ఆ న్యూస్ పై స్పందిస్తూ..ట్రోలర్స్ కి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు. నిజానికి ఈయన బిగ్ బాస్ షోలో ఎంటర్ అయ్యే టైంకి ప్రజలకు పెద్దగా తెలియదు. ఊహించని విధంగా ఓ  మోడల్‌  షోలోకి ఎంట్రీ ఇవ్వడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీంతో జెస్సీ నే  బిగ్‌బాస్‌ కు  డబ్బులిచ్చి మరీ  కంటెస్టెంట్‌గా వెళ్లాడు అంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

తాజాగా ఈ విషయం పై అందరికి  క్లీయర్ గా క్లారిటీ ఇచ్చాడు జెస్సీ. ఆయన మాట్లాడుతూ.." చాలా మంది నేను బిగ్ బాస్ లోకి  డబ్బులిచ్చి వచ్చానని అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను మీరు అనుకున్నంత రిచ్ కాదు.  నా అకౌంట్‌లో కేవలం రూ.11 వేలు మాత్రమే ఉన్నాయి. నాకు  తండ్రి లేరు.. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చా. నైట్ టైం జాబ్ చేసీ ఆ మనీ తో మోడలింగ్‌ నేర్చుకుంటూ ఇప్పుడు ఇలా ఈ స్దాయికి వచ్చాను. నాకు డబ్బు విలువ బాగా తెలుసు. బిగ్‌బాస్‌ ఆఫర్‌ నాకు వచ్చింది వెళ్లాను. అంతే.. నేను ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు..ఆ స్థోమత నాకులేదు" అని చెప్పుకొచ్చాడు జెస్సీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: