నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా కు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు, ఎన్నో అంచనాల తో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని ప్రస్తుతం థియేటర్ లలో  బ్లాక్ బాస్టర్ దిశ గా కొనసాగడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా లో నటించడానికి రెడీ గా ఉన్నాడు, ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తయ్యాయి, ఈ సినిమా ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించ నున్నారు. ఇలా ఇప్పటికే ఒక సినిమా విజయాన్ని ఆనందిస్తున్న బాలకృష్ణ మరో సినిమా లో నటించడానికి రెడీ గా ఉన్నాడు.

అయితే గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా లో నటించబో తున్నాడు, అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ త్రీ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు, ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ తో సినిమా ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో  తెరకెక్క బోయే సినిమా బడ్జెట్ 60 కోట్ల వరకు ఉండబోతుంది అంటూ ఒక వార్త ఫిలిం నగర్ లో వైరల్ అవుతుంది. నిర్మాత లు కూడా ఇంత బడ్జెట్ పెట్టడానికి అంగీకరిం చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: