సాధారణంగా మల్టీ స్టారర్ సినిమా తీయ్యాలంటే డైరెక్టర్స్ భయపడతారు. మరీ ముఖ్యంగా ఇద్దరు బడా హీరోలతో మల్టీస్టారర్ మూవి అంటే ఏ దర్శకుడు డేర్ చేయరు. మరీ ముఖ్యంగా మన తెలుగులో అయితే ఆ సాహసం ఎవరు చేయరు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క హీరోని తక్కువ చేసి చూయిస్తే మరో హీరో హీరో బాధపడతారు..అంతేనా నెట్టింట ఆ డైరెక్టర్ పరువు తీసేస్తారు. ఈ తలనొప్పి పనులు ఎందుకులే అని చాలా మంది డైరెక్టర్స్ మల్టీ స్టారర్ సినిమాల జోలికి వెళ్లరు.

ఒకవేళ వెళ్లినా కూడా స్టార్ హీరోలతో తెరకెక్కించే సాహసం చేయారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు బడా హీరోలను పెట్టి అది కూడా స్టార్ వారసులని పెట్టి హీరోలుగా సినిమా తెరకెక్కించారు దర్శక ధీరుడు రాజమౌళి. "ఆర్ ఆర్ ఆర్" అనే పేరుతో జక్కన్నసినిమా తీసిన విషయం తెలిసిందే. సంక్రాంతి  పండుగ  కానుకగా జనవరి 7న ఈ సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమైయారు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పనులను చకచకా చేస్తున్నాడు రాజమౌళి.

ఈ క్రమంలోనే ప్రీ రిలిజ్ ఈవెంట్ ను గ్రాండ్  గా ప్లాన్ చేసి రాజమౌళి..రీసెంట్ గా  రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కు సంబంధించి అద్దిరిపోయే లుక్స్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాజాగా రిలీజ్ అయిన  పోస్టర్ తో ఆర్ ఆర్ ఆర్  సినిమాపై అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లుక్స్ చూసిన పూజా హెగ్డే.."ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగా ఎదురుచూస్తున్న. రాజమౌళి చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. వీరి కాంబోని  స్క్రీన్ పై చూడాలని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా".. అంటూ ట్వీట్ చేయగా .. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: