తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా కోసం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్'అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ షో మూడు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది.ఈ షో కి వచ్చే సెలెబ్రిటీస్ కి తన పదునైన ప్రశ్నలు వేసి వారి నుండి నిజాలు రాబట్టి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు బాలయ్య.ఇప్పటికే ఈ టాక్ షోకి మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి హాజరైన విషయం తెలిసిందే.ఇక నాలుగో ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నారు. బాలయ్య షో కి మహేష్ బాబు గెస్ట్ గా రానునన్నాడనే విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 అంతే కాకుండా తాజాగా మహేష్బాబుతో సోషల్ మీడియాలో అన్ స్టాపబుల్ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో కలిసిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.' నా సాయంత్రాన్ని ఎన్.బి.కె గారితో అన్ స్టాపబుల్ గా ఆనందించాను' అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు మహేష్. నిన్నటితో అందుకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఇక ఈ ఎపిసోడ్ ను చూసేందుకు ఇతర నటుల అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ డిసెంబర్ 17వ తేదీన ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగానే మహేష్ బాబు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో క్లోజ్గా ఉంటారు. మహేష్ ఇప్పటివరకు బుల్లి తెర పై ఎక్కువగా అలరించలేదు. ఇక ఆయన అవార్డ్స్ ఫంక్షన్ కి రావడం కూడా అరుదుగానే చూస్తుంటాం. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. అగ్ర హీరోలు సైతం బుల్లితెరపై ఓటీటీ లో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇటీవల ఎన్టీఆర్ పోస్ట్ గా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో లో గెస్ట్ గా సందడి చేసి మంచి వినోదాన్ని అందించాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆహా ఓటీటీ లో బాలయ్య అన్ స్టాపబుల్ షో లో సందడి చేయబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: