అల్లు
అర్జున్ పుష్ప
సినిమా తర్వాత చేయబోయే
సినిమా పై ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన తన తదుపరి చిత్రాన్ని
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది.
బోయపాటి శ్రీను తాజాగా తెరకెక్కించి అఖండ
సినిమా ఇటీవల విడుదలై
మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆలరిస్తుండగా
మాస్ సినిమాలను తెరకెక్కించడంలో తాను స్పెషలిస్ట్ అని
బోయపాటి శీను మరొకసారి తనని తాను నిరూపించుకున్నాడు.
దాంతో పాటు ఈ
సినిమా రెండవ భాగం వేసవిలో విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్
మార్చి నెలలో పూర్తవుతుంది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న
అల్లు అర్జున్ ఆ సమయంలోనే
బోయపాటి శ్రీను సినిమాను మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు తెలుస్తుంది. ఈ చిత్రంలో
అల్లు అర్జున్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది ఒక పాత్ర ఊర
మాస్ కాగా మరొక పాత్ర క్లాస్ గా ఈ సినిమాలోని
హీరో పాత్రలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబో లో తెరకెక్కిన సరైనోడు
సినిమా సూపర్ హిట్ కాగా ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.