నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస మంచి సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్లాపులు అవుతున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యం గా ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మంచి మంచి కాన్సెప్ట్ లు ఉన్న సినిమాలను చేయగా అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కాలేదు కానీ నటుడిగా తనను తాను ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉన్నారు కళ్యాణ్ రామ్. కాగా ఇప్పుడు ఆయన కొంత గ్యాప్ తీసుకుని వరుస మంచి సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమా లను  లైన్ లో పెట్టి మరొకసారి ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు.అలా చారిత్రాత్మక నేపథ్యం గల బింబిసారా అనే చిత్రం మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు ఆయన. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ రాగా అవి భారీగా అంచనాలను పెంచింది. ఇక తాజాగా ఆయన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

నందమూరి వంశం లో ఇప్పటి తరం లో ఎన్టీఆర్ జై లవకుశ అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేయగా ఆ తర్వాత కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా ఎవరు ఈ సాహసం చేయకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆయన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో రాజేంద్ర అనే నూతన దర్శకుడు తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కథ ప్రకారం కళ్యాణరామ్ సినిమా లో మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నారు. మాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ హీరోథ్రిల్లర్ సినిమాతో ఎలాంటి గుర్తింపు తీసుకు తెచ్చుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: