ఒకనాటి టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరు అంటే వెంటనే ఎవరైనా సమంత నాగచైతన్య పేరు చెప్పేవారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈజంట విడిపోవడం ఇండస్ట్రీలోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో కూడ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికీ తెలియని రహస్యం.


రకరకాల రూమర్లు వీరి విడాకుల వ్యవహారం పై వచ్చాయి. వాటిని సమంత ఖండించడమే కాకుండా అలాంటి రూమర్లను ప్రచారం చేసిన వారి పై కేసులు కూడ పెట్టింది ఇది అంతా గతం. తన విడాకుల వ్యవహారం ముగిసిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రముఖ బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా పత్రిక ‘ఫిలిం ఫేర్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన మనసులోని అప్పటి వ్యధను బయటపెట్టింది.


నాలుగు సంవత్సరాలు వైవాహిక జీవితం ఆరు సంవత్సరాలు ప్రేమతో నాగచైతన్యతో తన బంధం ఎంతో ఆనందంగా గడిచిందని అయితే కొన్ని అభిప్రాయభేదాలు తమ వద్ద రావడంతో వాటితో కలిసి జీవించడంకంటే విడిపోవడం మంచిది అని భావించి విడిపోవాలి అని నిశ్చయించుకున్నప్పుడు తన కింద ఉన్న భూమి కదిలిపోతున్న భావన కలిగి తాను పాతాళంలోకి పడిపోయి చనిపోతానేమో అన్న భావన కల్గిందని కామెంట్స్ చేసింది. అయితే జరిగిపోయిన సంఘటన గురించి బాధపడుతూ రోజులు గడిపెకన్నా ధైర్యం తెచ్చుకుని పరిస్థితులలో పోరాటం చేయాలి అన్న భావన తనలో కలగడంతో తాను ఇప్పుడు మళ్ళీ పోరాటం చేస్తున్నాను అంటూ కామెంట్ చేసింది.


ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన తనకు భగవంతుడు ఎంతో ఇచ్చాడని అదే భగవంతుడు ఇప్పుడు తనకు పెట్టిన పరీక్షను ఎదుర్కుని ధైర్యంగా నిలబడాలని తాను నిశ్చయించుకున్నాను అంటూ తాను తిరిగి కెరియర్ లో పోరాటం చేయబోతున్న విషయాన్ని వివరించింది. సమంత బాలీవుడ్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడ ఒక సినిమా చేయబోతోంది అని వస్తున్న వార్తలను బట్టి ఆమె మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది..





మరింత సమాచారం తెలుసుకోండి: