అల్లు అర్జున్ తన షూటింగ్ ని పూర్తిచేసుకుని త్వరలోనే పుష్ప సినిమాని విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ కావడం గమనార్హం. ఇందులో హీరోయిన్ గా రష్మికా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 17 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి పాటలు అందిస్తున్నది దేవి శ్రీ ప్రసాద్. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ బాగానే అలరించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


తాజాగా నిన్నటి రోజున ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక అక్కడక్కడ మిగిలిన కొన్ని సన్నివేశాలను రెండు రోజుల లోపల పూర్తి చేయనున్నట్లు గా సమాచారం. శనివారం రోజున సెన్సార్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడం వలన అల్లు అర్జున్ ఎంతో సంతోషంతో చిత్ర బృందం లోని కొంతమందికి సడన్ సప్రైజ్ ఇచ్చారు.అక్కడ  ఉండేటువంటి 12మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 10 గ్రాములు చొప్పున ఒక ఉంగరాన్ని గిఫ్టుగా ఇచ్చినట్లు సమాచారం.


ఇక అలాంటి  వ్యక్తులలో.. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్లు, డ్రాయింగ్ డైరెక్టర్లు ఇతరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తరువాత ఆ సినిమాకి పని చేసిన అందరికీ ఒక మంచి పార్టీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది అల్లు అర్జున్. ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక సెట్ లో ఈ పార్టీని ఇచ్చినట్లుగా సమాచారం. ఈసెట్ సమంత, అల్లు అర్జున్ ఐటెం సాంగ్ కోసం వేసినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ఎంతో ఆనందంగా ఆ పార్టీని స్వీకరించారు. ఏది ఏమైనా  అల్లు అర్జున్ ఇలా అందరికీ బంగారు ఉంగరాలు ఇవ్వడం వల్ల, వారిలో మంచి పేరు సంపాదించారు అని చెప్పవచ్చు. ఇక పుష్ప-2  సినిమా కి ఏమి ఇస్తాడో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: