టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కళ్యాణం' అనే సినిమాతో వెండితెరపై హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాత మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఏకంగా అగ్రహీరోల సరసన చేరిపోయింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో ఆడిపాడిన కాజల్ అగర్వాల్.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సుమారు దశాబ్దకాలంపాటు తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఈ అందాల చందమామ.. గత ఏడాది ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్త ని ప్రేమించి పెళ్ళాడింది.

 ముంబై నగరంలోని తాజ్ ప్యాలెస్ అనే స్టార్ హోటల్లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా నటనకు ఫుల్స్టాప్ పెట్టకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్లలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ నీ ఓ దర్శకుడు ఘోరంగా అవమానించాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా పేరొందిన తేజ.ఈయన దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమా షూటింగ్ సమయంలో ఓ ఎమోషనల్  సన్నివేశంలో ఏడవాల్సి వచ్చిందట. అయితే చిన్నతనం నుంచే ఏడుపు అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన కాజల్ అగర్వాల్ కి..

ఒక్కసారిగా ఉన్నట్లుండి ఏడుపు సన్నివేశాల్లో నటించడం రాలేదట. దీంతో ఆగ్రహానికి లోనైన దర్శకుడు తేజ సెట్ లో అందరి ముందు కాజల్ ని ఇట్టి ఘోరంగా అవమానించారట. ఇక అందరి ముందు అలా తిట్టడాన్ని సహించలేకపోయిన కాజల్ అగర్వాల్ ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది. ఇక ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన కాజల్.. తేజ గారు నన్ను అవమానించినప్పటికీ తర్వాత ఆయన దగ్గర నుంచి నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అని చెప్పింది. లక్ష్మీ కళ్యాణం సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి, సీత వంటి చిత్రాల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: