సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు. అదృష్టం కలిసి రాక ఎంతోమంది టాలెంట్ ఉన్న హీరోయిన్లు సైతం స్టార్ డమ్ కోసం పాకులాడుతూ ఉంటారూ. అలాంటి హీరోయిన్లలో మలయాళీ భామ పూర్ణ కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించింది. తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడు సరైనోడు స్టార్ డమ్ మాత్రం సంపాదించలేకపోయింది. శ్రీ మహాలక్ష్మి అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవును, సీమటపాకాయ్ లాంటి సినిమాలలో నటించి ఎందుకని గుర్తింపు సంపాదించుకున్నారు.


 ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాలో పద్మావతి అనే పాత్రలో కనిపించి ఏకంగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ ఇలా ఇప్పటివరకు ఈ ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై కార్యక్రమాలలో కూడా జడ్జిగా అవాతారమెత్తి అందరినీ అలరిస్తుంది. అయితే ఇటీవలే అఖండ చిత్రంలో పద్మావతి పాత్రలో నటించిన పూర్ణ, వరదరాజులు పాత్రలో నటించిన శ్రీకాంత్ ఇద్దరు కూడా ఆలీతో సరదాగా అనే కార్యక్రమం లో స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.



 ఈ సందర్భంగా ఈ ఇద్దరు కూడా తమ కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పూర్ణ అవును సినిమా చేస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు. అవును సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు ఎలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగా షూటింగ్ పూర్తి చేశాను. సినిమా విడుదలయ్యాక చూసిన తర్వాత మాత్రం రెండు నెలలు సరిగ్గా నిద్ర పోలేదు అంటూ పూర్ణ చెప్పుకొచ్చింది. చీకటి పడితే చాలు ఎంతగానో భయం వేసేది. చివరికి స్నానం చేసే సమయంలో కూడా నా పక్కన ఎవరైనా కూర్చున్నారెమో అంటూ భయపడుతూ కంగారు పడ్డాను అని అంటూ పూర్ణ తెలిపింది. ఇండస్ట్రీ లో తనకు పేరు ఎక్కువగా రాకపోవడానికి కారణం సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడం దారుణం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: