హీరో చేతిలో లేని విధంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. తొలుత ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిరంజీవి. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న లుసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసిఫర్ సినిమాకు ఇది రీమేక్ కాగా చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా కథను మార్చి ప్రేక్షకుల ముందుకు ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్. 

త్రిష కథానాయిక గా నటించబోతుందని తెలుస్తుంది. సత్యదేవ్ మరియు నయనతార కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర చిత్రాన్ని చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు ఇది రీమేక్ కాగా చిరు స్థాయిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్. ఇలా ఒకేసారి రెండు సినిమాలను చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులోనూ తనకు సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో తెలియజేస్తూ ఉన్నాడు.

అయితే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను కూడా చేసి తనదైన మార్క్ చూపించాడు చిరు. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. వాల్తేరు వీరన్న అనే టైటిల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. మరి మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయిలో పలు సినిమాలను చేయడం పట్ల అందరికీ ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉండగా ఆయన ఇన్ని సినిమాలు చేయడం వెనక ఓ కారణం ఉందట. అదేమిటంటే ఆయన కూతురు సుస్మిత ఇన్ని సినిమాలు చేయడానికి ముఖ్య కారణం అని తెలుస్తుంది. ఆమె కూతురు ఆయన డేట్ల దగ్గర నుంచి ఆహార నియమాలు వరకు అన్నీ చూసుకుంటూ ఆయన బలంగా ఉండేలా చేస్తుంది.  ఆ విధంగా ఆయన అన్ని సినిమాలు చేయడానికి ముఖ్య కారణం ఆయన కూతురు సుస్మిత అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: