ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మల్టీ స్టారర్ సినిమా లకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికి తెలిసిందే. ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాల జోరు ఎక్కువగా లేకపోయినా, వెంకటేష్, మహేష్ బాబు హీరో లుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాల జోరు ఊపందుకుంది. ఆ తర్వాత మల్టీ స్టారర్ కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి, అందులో కొన్ని మంచి విషయాలను సాధించగా, మరి కొన్ని మాత్రం సక్సెస్ కాలేకపోయాయి. అలాగే నిర్మాతలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు, దానికి ప్రధాన కారణం ఇద్దరు హీరో లు ఉంటే వారికి సరిసమానమైన ఆర్టిస్ట్ లు ఉండాలి, అలాగే ఆ ఇద్దరు హీరో లకు సరిపోయే డేట్ లను సమకూర్చాలి. అలాగే వారికి కాంబినేషన్ సెట్ చేయడం కోసం చాలా వరకు బడ్జెట్ పెరిగిపోతుంది.

అందు కని మల్టీ స్టారర్ సినిమా లను ఎక్కువ శాతం నిర్మాతలు ప్రోత్సహించరు. అయితే ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా పాన్ ఇండియా రేంజ్ లో ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమా విడుదలకు ముందే జనాల నుండి ఎంతో క్రేజ్ ను సంపాదించుకోవడం తో , మరి కొంత మంది ఇలా మల్టీ స్టారర్ సినిమా లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు, ఇందు లో భాగం గా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో ఒక మల్టీ స్టారర్ సినిమా తీసే ఆలోచన లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ను గీత ఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఈ వార్తల పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: