నేషనల్ క్రష్ రష్మిక మందన నాగ శౌర్య హీరో గా వెంకీ కుడుముల దర్శకత్వం లో తెరకెక్కిన ఛలో సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి సినిమా లొనే తన అందంతో, అభినయంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని కూడా అందుకుంది. ఇలా మొదటి సినిమా తో టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక మందన ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన గీతా గోవిందం సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మరో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలను అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ వంటి సినిమా లతో విజయాలను అందుకోక పోయినా క్రేజ్ ను మాత్రం ఫుల్ గా సంపాదించుకుంది.

 అలా ఈ రెండు సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో మరో సారి టాలీవుడ్ లో రష్మిక మందన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇలా నటించిన తక్కువ సినిమాలే అయిన ఎక్కువ శాతం విజయాలను టాలీవుడ్ లో అందుకోవడంతో రష్మిక మందన టాలీవుడ్ లో లక్కీ బ్యూటీ గా మారిపోయింది.  ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కుతున్న  పుష్ప సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నటించిన ఎక్కువ శాతం సినిమాలు విజయం కావడం తో ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: