దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.. ఈ సినిమాలో ఇద్దరు లెజెండ్రీ స్టార్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. వారు ఎవరో కాదు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇకపోతే ఈ సినిమాను సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే..అయితే దీని కోసం జక్కన్న చాలా వెరైటీ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేసి , తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ విడుదల అవ్వడం కోసం ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ని థియేటర్ లు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని థియేటర్లలో కూడా ఈ ట్రైలర్ మారుమ్రోగనుంది.

ఇక ఇందులో జక్కన్న ప్లాన్ ఏమిటంటే.. సాధారణంగా థియేటర్లలో ట్రైలర్ విడుదల అయ్యింది అంటే.. చాలామంది ఫోన్ లో రికార్డు చేసి బయటకు లీక్ చేసి పడేస్తారు..కానీ అవి అనుకున్నంత క్లారిటీగా.. క్వాలిటీ గా ఉండవు.. తిరిగి సాయంత్రం నాలుగు గంటల వరకు యూట్యూబ్ లో విడుదల చేయరు కాబట్టి.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీడియోలు, ఫోటోలు,  స్క్రీన్ షాట్ లతోనే ఆర్ఆర్ఆర్ రచ్చ మొదలవుతుందని , ఈ సినిమా ట్రైలర్ ట్రెండింగ్ లోనే ఉంటుంది అని జక్కన్న ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

జక్కన్న తీసుకొన్న నిర్ణయం హృదయ కాలేయం డైరెక్టర్ అలాగే మెగా అభిమాని అయినటువంటి సాయి రాజేష్ కు ఏమాత్రం నచ్చలేదట. ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ ఈ నిర్ణయంతో ఎంతో నిరాశ పడ్డాను అంటూ వెల్లడించారు. ఇక ఆయన చెబుతున్న విషయం ఏమిటంటే ఇలా థియేటర్లలో ఒకసారి యూట్యూబ్ లో ఒకసారి వదలడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.. ముఖ్యంగా సౌండ్,  విజువల్స్ ఇలా అన్నీ కూడా చాలా బ్యాడ్ క్వాలిటీ తో మొబైల్ లోనే రికార్డ్ వీడియోస్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అందరూ చూసేస్తారు అంటూ ఆయన ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: