వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. ఈ చిన్న డైలాగుతో నే కుర్రకారుని ఉర్రూతలూగించింది జెనీలియా. తన చిలిపి నవ్వుతోనే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏ సినిమాలో నటించినా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. జెనీలియాను చూస్తే సినిమాలో నటించే హీరోయిన్ కాదు అచ్చంగా మన పక్కింటి అమ్మాయిలా కనిపించేది. ఈ అమ్మడికి ఇదే ప్లస్ పాయింట్ గా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులందరూ ఈ అమ్మడు ఎంతగానో ఆదరించారు అనే చెప్పాలి.


 ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ 2012లో నటుడు రితేష్ దేశ్ముఖ్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది ఈ అమ్మడు. దీంతో ఇక జెనీలియా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఇలా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్లు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్నారు. ఇంట్లో జెనీలియా కూడా వస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు జెనీలియా సిద్ధమవుతోంది అన్నది తెలుస్తుంది.


 మరాఠీ చిత్రంతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ చిలిపి హీరోయిన్. ఈ విషయాన్ని ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. మీ అందరి ఆశీర్వాదంతో వివిధ భాషల్లో నటించి ప్రేమ గౌరవాన్ని పొందాను. అయితే మహారాష్ట్రలో పుట్టిన తాను ఇప్పటివరకు మరాటి చిత్రాలు మాత్రం నటించలేక పోయాను. ఇక ఇప్పుడు పదేళ్ళ విరామం తర్వాత వేద్ అనే మరాఠీ చిత్రంలో నటించి ఈ కలను నిజం చేసుకుంటున్నా.. నా భర్త నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాతో మొదటి సారి దర్శకుడిగా కెరియర్  ప్రారంభించబోతున్నారు. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తెలుగులో మాత్రం రీ ఎంట్రీ  ఇవ్వకపోవడంతో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: