భారీ అంచనాల మధ్య రాబోతున్న అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా గురించి చాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ పాన్ ఇండియా హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం ఇది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ , స్టార్ హీరో అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం. సుకుమార్ మూవీ 'రంగస్థలం' సంచలన విజయం తరువాత రానున్న తొలి చిత్రం కావడం మరో ఆసక్తికరమైన అంశం. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ ఫుల్ మాస్ హీరో పాత్రలో చేస్తున్నాడు. ఇలా చాలా విశేషాలే ఉన్నాయి. దాంతో అంచనాలు అలా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ బాగా ఆకట్టుకోగా టీజర్, పాటలు, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను అలా రెట్టింపు చేసేసాయి.

ఇక ఈ సినిమా డిసెంబర్ 17న తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్న సమయంలో కరోనా భయం కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ మళ్ళీ మొదలయ్యింది అన్న వార్తలు జోరు పెరిగాయి. ఇది ఏమైనా తగ్గేదేలే...!! రిలీజ్ అనుకున్న డేట్ కే జరుగుతుందని అని స్ట్రాంగ్ గా వుందట టీం. అయితే అప్పటికి ఒకవేళ కరోనా కేసుల సంఖ్య పెరగడం తగ్గకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రేక్షకులను అందరినీ థియేటర్లకు రప్పించడం సబబేనా అని అందరూ ఆలోచనలో పడ్డారు.

ముఖ్యంగా ఈ విషయంపై బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం వరకు కరోనా వేరియంట్ అయిన ఓమిక్రాన్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖులు అంటున్నారు. గతంలో కరోనా పెట్టిన కష్టాల నుండి ఇంకా కొన్ని కుటుంబాలు కోలుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇలాగె జరిగితే తట్టుకునే శక్తి లేదని బాధపడుతున్నారు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజుల పాటు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: