తెలుగు సినిమాల్లో కొన్ని మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి కాస్త అభిమానులు ఆసక్తి కరంగా చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఇందులో ప్రధానంగా కొన్ని మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా మెగా హీరోలు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోసినిమా వస్తుందని నాలుగేళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రావడం లేదు. ఈ మల్టీస్టారర్ సినిమాను నిర్మించడానికి సుబ్బిరామిరెడ్డి సిద్ధంగా ఉన్నా సరే చాలా మంది దర్శకులు ముందుకు రావడం లేదనే ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో కొంతమంది దర్శకులు సినిమా అటు ఇటూ అయితే తమకు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అని తగుతున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే సుబ్బిరామిరెడ్డి మాత్రమే సినిమా బడ్జెట్ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఎంత బడ్జెట్ అయినా సరే తాను పెట్టుకుంటాను అని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ సానుకూలంగా లేదని చిరంజీవికి సమయం దొరకడం లేదని ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ మెయిల్ ఇద్దరు సినిమాలు చేయడానికి రెడీ గా లేరని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసిన నిర్మాతలు ఈ విషయంలో కాస్త తొందరగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఒప్పించి విధంగా కష్టపడటం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాకు సంబంధించి కాస్త పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని చిరంజీవి కూడా త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: