సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము నటించిన మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటారు. అయితే అలా నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోలలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ హీరో, కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఇలా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ హీరో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ హీరో ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి కొండపొలం అనే ఒక నవల ఆధారంగా తెరకెక్కించాడు.  ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన కొండాపొలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించేలేకపోయింది.

ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నఈ హీరో, తన రెండవ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. అయితే ఈ హీరో మూడవ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అర్జున్ రెడ్డి` తమిళ్ రీమేక్ `ఆదిత్య వర్మ` డైరెక్టర్ గిరీషాయ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ని ఫస్ట్ లుక్ ని హీరో పంజా వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 13 న మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇలా పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: