అమలాపాల్ .. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. నటిగా తన కెరియర్ ను ప్రారంభించింది.. మొదట్లో తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలలో నటించిన ఈ అమ్మడు మధ్యలో సినిమాలకు దూరంగా ఉంది. పెళ్ళి చేసుకుని భర్త తో సంసారం చేస్తూ ఉంది. కొన్ని మనస్పర్థల కారణంగా భర్త  నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ చేతిలో వరుస సినిమాలలో నటిస్తూ బిజిగా వుంది. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది


అందుకే గతం లో చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.గతంలో మాదిరి మరోసారి విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది.కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ చేసిన అమలాపాల్ తాజాగా హిందీలోనూ ఓ వెబ్ సీరిస్ చేసింది. అదే ‘రంజిష్‌ హీ సహీ’. జనవరి 13 నుండి వూట్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ సోషల్ మీడియాలో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది..


కాగా, పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో మహేశ్ భట్ ఈ వెబ్ సీరిస్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్ గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే. ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అంటున్నాడు తాహిర్. మిగిలిన సగం ఫిక్షన్ అని చెబుతున్నాడు. ఇందులో అతను దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల విధేయుడిగా ఉండే ఈ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథ ఉంటుంది.సిగరెట్ తాగడం, లిప్ లాక్ చేయడం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో ఉండటంతో అది కాస్త వైరల్ అయ్యింది. అమలాపాల్ ప్రస్తుత పరిస్థితికి ఆమె పాత్రను అన్వయించుకుని కూడా కొందరు చూస్తున్నారు.  కేవలం గ్లామర్ షోకు పరిమితం కాకుండా అమలాపాల్ ఆ పాత్ర ద్వారా చక్కని నటన కూడా ప్రదర్శించిందని తెలుస్తోంది. డైరెక్టర్ జీవితం లో అమ్మడు చిచ్చు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: