ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతుంది ఢీ కార్యక్రమం. ఇక ఎన్నో సీజన్ల నుంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఈ కార్యక్రమంలో కి ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకొని పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇటీవలే ఢీ 13వ సీజన్ ముగియడంతో 14వ సీజన్ ప్రారంభమైంది. ఒకప్పుడు ఢీ కార్యక్రమం అంటే కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ లతోపాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ కూడా అందుతోంది.



 దీంతో ఈ కార్యక్రమం వీక్షించడానికి బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గత సీజన్ వరకు ఢీ షో లో బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించిన సుధీర్ రష్మీ టీమ్ లీడర్ గా ఉండే వారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరిని చూడటానికి ఎంతో మంది ప్రేక్షకులు ఢీ షో చూసేవారు. కానీ 14వ సీజన్లో మాత్రం వీరిని పక్కన పెట్టేశారు. దీంతో సుధీర్ రష్మీ ల ను మళ్లీ ఢీ లోకి తీసుకు రావాలి అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు కూడా పెరుగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవలే ఢీ స్టేజీపై సుధీర్ రష్మీ మళ్లీ పుట్టారు.



 ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా ఢీ స్టేజ్ పై సుదీర్ రేష్మి మళ్లీ పుట్టడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి ఢీ ప్రోమో విడుదలైంది. అయితే ఈ కార్యక్రమంలో రవి కృష్ణ, నవ్య స్వామి టీం లీడర్ గా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఒక పాట పై హాట్ పర్ఫామెన్స్ చేశారు. ఇక ఇలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత హైపర్ ఆది ఊరుకుంటాడా తనదైన శైలిలోనే కామెంట్ చేశాడు. నీ రూపంలో ఆ అమ్మే మళ్ళీ పుట్టింది. నీ రూపంలో ఆ అయ్యే  మళ్లీ పుట్టాడు అంటూ సుధీర్ రష్మీ ల ను గుర్తు చేస్తూ నవ్య స్వామి, రవి కృష్ణ పై కామెంట్ చేస్తాడు హైపర్ ఆది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: