సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా ఎప్పుడు వస్తుందో అని ఓవైపు ఆయన అభిమానులు ఎప్పటి నుండో ఎంతో ఆశాగా ఎదురు చూస్తుండడం, అయితే మరోవైపు ఇటీవల ఆయన కరోనా బారిన పడడం, ఆయన కొద్దిరోజుల క్రితం ఆయన సోదరుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడం ఘట్టమనేని ఫ్యామిలీని పూర్తిగా విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా పరశురామ్ పెట్ల ఈ సినిమాని మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్.

14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో అత్యధిక బడ్జెట్ తో నిర్మితం అవుతున్న సర్కారు వారి పాట మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఇక మహేష్ కి కరోనా సోకడంతో ప్రస్తుతం యూనిట్, ఆయన లేకుండా పలు సీన్స్ విశాఖపట్నంలోని షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారు. సముద్రఖని విలన్ గా చేస్తున్న ఈ సినిమాకి మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ ఆగష్టు 5కి వాయిదా పడింది అని అంటున్నారు.

మహేష్ ఎంతో బాధలో ఉన్న ఈ సమయంలో ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని యూనిట్, కొన్ని నెలల పాటు తదుపరి షెడ్యూల్ వాయిదా వేశారని అంటున్నారు. మరోవైపు సర్కారు వారి పాట నుండి ఫస్ట్ సాంగ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తాం అంటూ ఇటీవల ఒంటి ప్రకటించింది. మరి రేపు సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. మొత్తంగా ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తమ హీరో సినిమా సాంగ్స్, మూవీ అప్ డేట్ విషయమై మాత్రం ఎదురు చూస్తున్నారు. మరి వారికి యూనిట్ నుండి ఎటువంటి న్యూస్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: