ఆయన దర్శకత్వం వహించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. దాంతో ఆయనకు దేశం అంతటా మంచి క్రేజ్ మరియు డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి దర్శకుడిగా రాజమౌళి ఒక్కడికే మంచి పెద్ద పేరు ఉండేది కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా విడుదల అయిందో అప్పటినుంచి రాజమౌళి తర్వాత సుకుమార్ పేరు కూడా దేశమంతటా వినిపించడం మొదలైంది. ఆ విధంగా పుష్ప సినిమా సుకుమార్ పేరు దేశ స్థాయిలో వినిపించే విధంగా చేసింది అని చెప్పవచ్చు.
అయితే నార్మల్ హిట్ కొట్టిన దర్శకుడుకే మన హీరోలు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఆయనతో సినిమాలు చేయాలని కోట్ల కొద్దీ అడ్వాన్స్ లు తమ నిర్మాతల దగ్గర్నుంచి ఇప్పిస్తూ ఉంటారు. అలాంటిది సుకుమార్ దేశమంతా మెచ్చే దర్శకుడు అయ్యాడు కనుక ఈ దర్శకుడితో సినిమా కోసం అందరు హీరోలు కూడా క్యూలు కట్టారు. ఈ నేపధ్యంలో సుకుమార్ తన లైనప్ ను ఎంతో బలం గా ఏర్పరుచుకున్నాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ తో ఆయన సినిమా చేస్తుండగా ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడు. పుష్ప 2 చిత్రాన్ని దసరా కు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు సుకుమార్.