మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత బాబీ దర్శకత్వంలో చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో కొంత మంది హీరోలు ఈ దర్శకుడితో సినిమా చేయాలని భావించారు. కానీ బాబీ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసి భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. అయినా కూడా ఈ దర్శకుడితో సినిమా చేయాలనే కొంత మంది హీరోలకు ఏమాత్రం తగ్గలేదు. ఎన్టీఆర్ ఏరి కోరి మరి ఈ దర్శకుడు తో సినిమా అవకాశం ఇవ్వగా అది కాస్త సూపర్ హిట్ అయి ఎన్టీఆర్ కు మర్చిపోలేని హిట్ తెచ్చిపెట్టింది.

జై లవకుశ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ఒక్క ఎన్టీఆర్ ను చూసి పులకరించిపోయే ఆయన అభిమానులు ఒకే తెరపై ముగ్గురు ఎన్టీఆర్ లను చూసి ఆనంద పడిపోయారు. ఆ విధంగా బాబీకి మరింత డిమాండ్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో వాల్తేరు వీరన్న అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది యూనిట్. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు బాబి. 
 
అయితే ఈ సినిమా లో బాబి చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారు. ఇంతవరకు ఏ దర్శకుడు చూపించని విధంగా సరికొత్త లుక్ తన మీద చూపించే పోతున్నాడట. దాని కోసం కొంత రిస్కు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఫలిస్తే మంచి పేరు రావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే మెగా అభిమానులు నుంచి బాబీ మంచి ప్రశంశలు వస్తాయి అని చెప్పవచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తు ఉండగా మరొకవైపు భోళా శంకర్ అనే సినిమాలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆయన నటించిన ఆచార్య సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: