టాలీవుడ్ హీరోయిన్ సదా అంటే తెలియనివారుండరు. మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సదా.. అప్పటి అగ్ర దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'జయం' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అందాలభామ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంది. ఇక దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'అపరిచితుడు' లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో నటించి అనతికాలంలోనే భారీ గుర్తింపు దక్కించుకుంది.

అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు కొత్త హీరోయిన్ల రాక, సినిమాల ఎంపికలో పొరపాట్ల వల్ల క్రమంగా సదా కెరియర్ డల్ అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం సదా సినిమాలేవీ చేయకపోయినా.. సొంతంగా మాత్రం ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే దక్షిణాది సినీ పరిశ్రమలో తన కంటూ మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సదా ని ఓ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. లవర్ బాయ్ నితిన్, సదా జంటగా స్టార్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం 'జయం'. సదా కు మాత్రమే కాదు నితిన్ కి కూడా ఇదే డెబ్యూ మూవీ కావడం విశేషం.

చిత్రం మూవీస్ బ్యానర్ పై దర్శకుడు తేజ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో మ్యాచో హీరో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా 2002 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం 3.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే చేసిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా 15.16 కోట్ల షేర్ కాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో హీరోయిన్ సదా ఏడవాల్సి ఉంటుంది. అయితే ఆ షాట్ లో సదా కు ఏడవడం చేత కాకపోవడంతో టేకుల మీద టేకులు తీసుకుందట. దాంతో విసిగిపోయిన డైరెక్టర్ తేజ లాగిపెట్టి ఒక్కటి ఇవ్వడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారట. మరోవైపు తేజా కొట్టిన చెంప దెబ్బకు సదా నిజంగానే ఏడ్చేయడంతో అప్పుడు సీన్ కూడా బాగా పండిందట.ఇక ఇదే విషయాన్ని స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: