యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి ప్రస్తుతం తన తదుపరి చిత్రం పై ఫుల్ ఫోకస్ పెట్టాడు, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు కూడా జరిగాయి. ఇది ఇలా ఉంటే కొరటాల శివ కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు.

అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది,  ఈ  సినిమాను కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విరివిగా పెరుగుతూ పోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే తెలియజేసింది, అయితే తాజాగా ఈ రోజు ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఇప్పటికే ఆచార్య సినిమా పూర్తి కావడంతో కొరటాల శివ, ఎన్టీఆర్ తో తెరకెక్కించే  సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుండి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇప్పటికే అనిరుద్ తెలుగులో అజ్ఞాతవాసి, నాని  హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: