కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడు మళ్ళీ తీవ్రంగా పెరుగుతుంది. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కరొన పాజిటివ్ కేసులు కూడా భారీగా పెరుగుతూన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుథున్నారు.. మూడో దశ కరోనా అందరినీ భాధిస్తుంది. ఇప్పటికే చాలా మంది కరోనా వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవడం తర్వాత చనిపొయారు. సినిమా పరిస్రమలొ ఎక్కువ మంది ప్రాణాలును కొల్పొయారు. ఇప్పటికీ పరిస్థితి తగ్గలేదు. ఇప్పుడు సినీ హీరోయిన్లు చాలా మంది కరోనా తో పోరాడుతున్నారు.
తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మంది కరొనా మహమ్మరి తో పోరాడుతున్నారు.. నిన్న హీరో మమ్ముట్టి కరోనా బారిన పడినట్లు తెలియజెసారు. ఇప్పుడు మరో హీరోయిన్ కరోనా తో పోరాడుతున్నారు. తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి కరోనా బారిన పడింది. ఆ లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయినా ఈ మమహ్మరి సోకింది.
ప్రస్తుతం ఐసోలేషన్లో ఉండి డాక్టర్ల సూచనల ను, సలహాలను పాటిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. భౌతిక దురాన్ని కలిగి ఉండండి. శానిటైజ్ చేసుకోండి.. టీకా తీసుకోండి. నేనూ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తాను' అని డింపుల్ పోస్ట్ లో పెర్కొంది. పోయిన సంవత్సరం ఈ అమ్మడు కుటుంబంలో పదిహేను మందికి కరోనా సొకిన విషయం తెలిసిందే.
హీరో వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి కాలుపెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడం తో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చెస్తుంది. అంతేకాదు రవితేజ నటిస్తున్న ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరో వైపు తమిళ సినిమాలలొ నటించె ప్రయత్నం చెస్తుంది.