యువ హీరో అల్లు శిరీష్ దాదాపుగా తన సినిమాను విడుదల చేయక రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. అయితే కేవలం చివరిగా తను విడుదల చేసిన సినిమా..ABCD.అయితే తను ప్రస్తుతం నటిస్తున్న సినిమా సహజీవనం అనే కాన్సెప్టుతో నిర్మించబడుతోంది. కానీ ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు.. ఈ చిత్రంలో మాత్రం కథానాయికిగా అను ఇమ్మానియేల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తప్ప వేరే సినిమాని ఏది ఒప్పుకోలేదు అల్లు శిరీష్. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే అల్లు శిరీష్.. బాలీవుడ్ వైపు తన అడుగులు వేయాలని చూస్తున్నట్లుగా సమాచారం.


ఇక దీనికి తోడు అప్పుడప్పుడు ముంబైకి వెళ్లి వస్తూ ఉన్నాడట అల్లు శిరీష్.. ఇక దీనికి తోడు తన తండ్రి అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ సినిమాల వైపు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక తన తండ్రికి సహాయం చేస్తూనే తన కెరియర్ ని అక్కడ మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక అల్లు అరవింద్  జెర్సీ సినిమాతో పాటు.. మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే కేవలం అల్లుశిరీష్ బాలీవుడ్ లో  నిర్మాణరంగం వైపా, హీరో గా ఎంట్రీ ఇస్తాడు అనే విషయం మాత్రం తెలియడం లేదు.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఆహా ఓటిటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందట.. దీంతో వీడియో దారులు ఈ యాప్ తో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ నీ యూజ్ చేస్తున్నప్పుడు సడన్ గా క్లోజ్ అవ్వడం, ఒకేసారి రెండు లాగిన్ కాలేకపోవడం.. వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయాన్ని అల్లు శిరీష్ కు ఒక యూజర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడట. అయితే ఈ విషయంపై అల్లు శిరీష్ ఒక రిప్లై ఇవ్వడం కూడా జరిగింది.. ఆహ తో తనకు సంబంధం లేదని... కేవలం కస్టమర్ కేర్ నే సంప్రదించండి అంటూ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: